జల్లించిన మైదా పిండి లో నెయ్యి ఉప్పు వేసి ముందు నీరు కాలపుకుండా బ్రేడ్ పొడి మాదిరి అయ్యేదాకా కలుపుకోవాలి
బాగా కలిపిన పిండిలో తగినన్ని నీరు చేర్చుకుంటూ పిండిని గట్టిగా వత్తుకోవాలి. తరువాత పైన నెయ్యి రాసి 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి
10 నిమిషాల తరువాత పొడి పిండి చల్లి పూరీలంతా మందాన వత్తుకోవాలి. (పొడి పిండి కాస్త ఎక్కువగా చల్లుకోవాలి
పలుచగా వత్తుకున్న పిండిని చతురస్రాకారంలో కోసుకోవాలి. తరువాత చతురస్రాకారంలో చుట్టూ అంచులకి ¼ ఇంచ్ వదిలేసి మధ్యన 4-5 గాట్లు పెట్టుకోవాలి. ఆ తరువాత అంచులని గట్టిగా నొక్కుతూ లోపలికి రోల్ చేసుకోవాలి.
బాగా వేడెక్కిన నూనెలో కొన్ని తొనలు వేసి ముందు మీడియం ఫ్లేమ్ మీద తొనలు రంగు మారేదాకా వదిలేస్తే, తొనలు ఉడుకుతాయ్. ఆ తరువాత పెద్ద ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుని తీసుకుని జల్లెడలో లేదా బుట్టలో వేసుకోవాలి
కారం నల్ల ఉప్పు కలిపి వేడి వేడి తొనలని ఎగరేస్తూ కారం చల్లుకోవాలి. లేదా కరివేపాకు కారం కూడా చల్లుకోవచ్చు.